Hindu Maha Sabha: గోమూత్రం తాగితే కరోనా పరార్.. ఇష్టంగా తాగిన 200 మంది!

  • గోమూత్ర పార్టీ నిర్వహించిన అఖిల భారతీయ హిందూ మహాసభ
  • స్వామి చక్రపాణి సహా గోమూత్రం తాగిన 200 మంది
  • దేశవ్యాప్తంగా ఇలాంటి పార్టీలు నిర్వహిస్తామని ప్రకటన
Hindu Maha sabha Hosts Cow Urine Drinking Party

భయపెడుతున్న కరనా వైరస్ నుంచి బయపడేందుకు గోమూత్రం చక్కని ఔషధంలా పనిచేస్తుందని అఖిల భారతీయ హిందూ మహాసభ పేర్కొంది. ఈ మేరకు ‘గోమూత్ర పార్టీ’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో స్వామి చక్రపాణి మహరాజ్ సహా ఆయన బృంద సభ్యులు గోమూత్రాన్ని తాగారు. అంతేకాదు, కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 200 మంది కూడా గోమూత్రాన్ని తాగారు. ఈ సందర్భంగా స్వామి చక్రపాణి మాట్లాడుతూ.. గోమాంసం తిన్నందు వల్లే కేరళలో వరదలు సంభవించాయన్నారు. గోమూత్రం తాగితే కరోనా దరిచేరదని అన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ‘గోమూత్ర పార్టీ’లను మరిన్ని నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచుతామని ఈ సందర్భంగా స్వామి చక్రపాణి మహరాజ్ పేర్కొన్నారు.

తాము 21 సంవత్సరాల నుంచి గోమూత్రం తాగుతున్నామని, ఆవు పేడతో స్నానం చేస్తున్నామని పార్టీకి హాజరైన ఓ ప్రకాశ్ తెలిపారు. ఈ కారణంగా ఇంగ్లిష్ మందులు వాడాల్సిన అవసరం తమకు రాలేదన్నారు. కేన్సర్‌ను నివారించేందుకు గోమూత్రం చక్కని ఔషధంలా పనిచేస్తుందని కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేతలు తెలిపారు.

More Telugu News