మధ్యప్రదేశ్లో రేపే బలపరీక్ష.. రెడీ అవుతున్న కమల్నాథ్!
- జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ను వీడిన తర్వాత సంక్షోభం
- మైనారిటీలో పడిందన్న శివరాజ్సింగ్ చౌహాన్
- బలపరీక్షకు సిద్ధం కావాలంటూ గవర్నర్ ఆదేశం
కమల్నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని, ఫలితంగా ప్రభుత్వాన్ని నడిపే హక్కు కోల్పోయిందని ఈ సందర్భంగా చౌహాన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోవాల్సిందేనని, అప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు లేదని అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం బలపరీక్షకు సిద్ధం కావాలని స్పీకర్ను గవర్నర్ ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. యువ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ను వీడిన తర్వాత.. ఆయనకు మద్దతుగా మరో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడింది.