ఊహించినట్టే జరిగింది.. ఒక్క నిమిషంలో మరో రూ. 13 లక్షల కోట్లు హాంఫట్!
- 5 నిమిషాల్లో 2,640 పాయింట్ల నష్టం
- గురువారంతో పోలిస్తే 8 శాతం పతనం
- 8,800 వద్ద నిఫ్టీకి లభించని మద్దతు
నిన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ 1,37,12,558.72 కోట్లుగా ఉండగా, ఈ ఉదయం అది మరో రూ. 9 లక్షల కోట్లకు పైగా తగ్గి, 1,24,11,324 కోట్లకు చేరుకుంది. ఎన్ఎస్ఈ-50, బీఎస్ఈ-30లోని అన్ని కంపెనీలూ నష్టాల్లోనే నడుస్తున్నాయి. ఆసియా మార్కెట్లలో సైతం నష్టాల తీవ్రత అధికంగా ఉంది. కాగా, 8,800 పాయింట్ల వద్ద కొనుగోలు మద్దతును కూడగట్టుకోవడంలో నిఫ్టీ విఫలం కాగా, ఈ పతనం మరింత అధికం కావచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.