Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

  • ఈ నెల 11 నుంచి నామినేషన్ల స్వీకరణ
  • ఈ నెల 23న పోలింగ్
  • 27వ తేదీన ఓట్ల లెక్కింపు
Muncipal elections notification released in AP

ఏపీలో పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 16వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు వీలు కల్పించారు. ఈ నెల 23న పోలింగ్, 27వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేశ్ కుమార్ వెల్లడించారు.

కాగా స్థానిక సంస్థల ఎన్నికలను మూడు దశల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఈ నెల 21న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, ఈ నెల 27న పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ , ఈ నెల 29న పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ చేపట్టనున్నారు.

More Telugu News