Chandrababu: ఆ మహిళ ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?: చంద్రబాబునాయుడు

  • పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీ పెద్ద మోసం
  • టీడీపీ హయాంలో కట్టించిన ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వరు?
  • నిరుపేద మహిళ అడిగిన ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఏం జవాబిస్తుంది?
Chandrababu Naidu asks AP Government What does the answer to the woman questions

పేదలకు రాజధాని ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం చేయనున్న ఇళ్ల స్థలాల పంపిణీ పెద్ద మోసం అని ఓ మహిళ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. తెలుగుదేశం హయాంలో కట్టించి సిద్ధం చేసిన ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వరు? ఆ ఇళ్ళ కోసం మేం కట్టిన డబ్బు సంగతేంటి? మాకు ఇచ్చిన బాండ్లకు ఈ ప్రభుత్వం జవాబుదారీ కాదా? మాకిచ్చిన ప్లాట్లు వేరే వాళ్లకు ఎలా ఇస్తారు? అని ప్రభుత్వాన్ని ఈ నిరుపేద మహిళ ప్రశ్నిస్తున్నారంటూ ఓ వీడియోను చంద్రబాబు పోస్ట్ చేశారు.

ఇప్పటికే ఫ్లాట్ కోసం కట్టిన డబ్బుకు వడ్డీలు కట్టలేక, ఇంకోవైపు ఇంటి అద్దెలు చెల్లించలేక అష్టకష్టాలు పడుతున్నామని, రాజధానికి భూములిచ్చిన రైతులకు అన్యాయం చేశారని, ఆ భూముల్లో పేదలకు పట్టాలివ్వడం వల్ల  రైతులకు, పేదలకు మధ్య తగాదాలు పెట్టడం ఏంటి?  అని ప్రశ్నిస్తున్న ఆ మహిళకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని చంద్రబాబు అన్నారు.

More Telugu News