12 Year Old Girl: విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, ఉరి.. ఏడుగురు విద్యార్థుల అరెస్ట్!

  • పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు
  • పరీక్ష అయిపోయిన తర్వాత పార్టీ పేరుతో తీసుకెళ్లి అత్యాచారం
  • అనంతరం సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరి వేసిన వైనం
Assam Girl Allegedly Raped and Hanged From Tree

పదో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై అదే తరగతి చదువుతున్న ఆమె స్నేహితులు సామూహిక మానభంగం చేసి, ఆపై చెట్టుకు ఆమెను ఉరి వేసిన ఘటన వెలుగుచూసింది. ఈ దారుణ ఘటన అసోంలో చోటుచేసుకుంది. వీరంతా 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.

అసోంలోని బిశ్వనాథ్ జిల్లా పోలీసులు ఈ కేసుకు సంబంధించి వెల్లడించిన వివరాల ప్రకారం... గోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్లా గ్రామంలో శుక్రవారం నాడు ఈ ఘటన సంభవించింది. పరీక్ష రాసిన అనంతరం... పార్టీ చేసుకుందామని సదరు బాలికను ఇతర విద్యార్థులు పిలిచారు. ఆ తర్వాత ఆమెను ఓ ఇంటికి తీసుకెళ్లారు. ఆ ఇంట్లోనే శుక్రవారం రాత్రి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత సమీపంలోని అడవిలో ఓ చెట్టుకు ఉరి వేశారు. శనివారం నాడు బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ దారుణానికి పాల్పడ్డ ఏడుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News