Mekathoti Sucharitha: వట్టిచెరుకూరు ప్రమాదంలో మృతులకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం: హోం మంత్రి సుచరిత

  • ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
  •  మృతులందరూ పేద కుటుంబాలకు చెందిన వారే
  •  వైఎస్ఆర్ బీమా కింద మరికొంత పరిహారం అందజేస్తాం
AP Home Minister Sucharita anounces 2 lakhs of compensation to the victims

గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలో తుఫాన్ వాహనం అదుపుతప్పి వాగులో పడిన ఘటనపై హోం శాఖ మంత్రి సుచరిత స్పందించారు. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని అన్నారు. మృతులందరూ పేద కుటుంబాలకు చెందిన వారేనని, ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. వైఎస్ఆర్ బీమా పథకం కింద మరికొంత పరిహారం అందజేస్తామని అన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించి అండగా ఉంటామని తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

More Telugu News