Gay: తనను ప్రేమించి.. చివరికి ఓ అమ్మాయిని పెళ్లాడాడంటూ యువకుడి ఫిర్యాదు... తల పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు!

  • ఫేస్ బుక్ లో పరిచయమైన యువకుడు
  • గోవాకు వెళ్లి నిశ్చితార్థం
  • మరో అమ్మాయితో పెళ్లి కావడంతో ఫిర్యాదు
Police Gomplaint on Youth by a Gay

ఫేస్ బుక్ లో పరిచయమై, తనను ప్రేమించానంటూ వెంటపడిన ఓ యువకుడు, ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లాడాడంటూ, ఓ స్వలింగ సంపర్కుడు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో, వారు కేసు ఎలా పెట్టాలన్న అయోమయంలో తల పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే, జీడిమెట్ల సమీపంలో నివాసం ఉండే మద్దంగుల శ్రీను అలియాస్ లక్కీ రాయ్ (26)కి, మార్చి 2017లో ఫేస్ బుక్ మాధ్యమంగా అత్తాపూర్ లోని మహ్మద్ ఫిరోజుద్దీన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ స్వలింగ సంపర్కులే కావడంతో, పబ్బులకు, సినిమాలకు, షికార్లకు కలిసి తిరిగారు. గత సంవత్సరం గోవాకు వెళ్లి అక్కడ ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు.

ఈ క్రమంలో గత వాలెంటైన్స్ డే నాడు శ్రీను పెళ్లి గురించి ప్రస్తావించగా, అంగీకరించిన ఫిరోజుద్దీన్, అతన్ని ఇంటికి తీసుకెళ్లి కుటుంబీకులకు, స్నేహితులకు పరిచయం చేశాడు. ఆపై, తాను మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ చిత్రాలను ఫేస్ బుక్ లో చూసిన శ్రీను నిలదీయగా, తొలుత బుకాయించాడు. రెండు వారాల క్రితం ఆమెను వివాహం చేసుకోగా, విషయం తెలుసుకున్న శ్రీను పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును ఎలా దర్యాఫ్తు చేయాలో తెలియక, న్యాయ సహాయం కోరిన పోలీసులు, విచారిస్తున్నామని తెలిపారు.

More Telugu News