Raviteja: మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ

  • 'క్రాక్' సినిమాతో బిజీగా రవితేజ 
  • కొత్త కథతో మెప్పించిన నక్కిన 
  •  లైన్లో 'రాక్షసుడు' దర్శకుడు  
Krack Movie

ప్రస్తుతం రవితేజ 'క్రాక్' సినిమా చేస్తున్నాడు. 'ఠాగూర్' మధు నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే దర్శకుడు రమేశ్ వర్మకు రవితేజ ఓకే చెప్పేశాడు. కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఈ మధ్య హిట్ కొట్టిన బెల్లంకొండ సినిమా 'రాక్షసుడు' దర్శకుడు రమేశ్ వర్మనే.

ఈ సినిమాతో పాటు రవితేజ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ దర్శకుడు పేరే నక్కిన త్రినాథరావు. 'సినిమా చూపిస్త మావ' .. 'నేను లోకల్' .. 'హలో గురు ప్రేమకోసమే' వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్లు ఆయన నుంచి వచ్చినవే. ఆయన ట్రాక్ రికార్డ్ చూసే రవితేజ ఓకే అనేశాడట. ఈ సినిమాకి విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మాతలుగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. రమేశ్ వర్మ ప్రాజెక్టు కంటే ముందే త్రినాథరావు ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది.

More Telugu News