పట్టా మార్పిడికి రూ. 10 లక్షలు డిమాండ్ చేసి దొరికిపోయిన డిప్యూటీ తహసీల్దార్
- నాలుగేళ్ల సమస్యను తాను పరిష్కరిస్తానన్న జయలక్ష్మి
- రూ. 13 లక్షలు డిమాండ్ చేసి రూ. 10 లక్షలకు ఒప్పందం
- ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు
కలెక్టరేట్లో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న జయలక్ష్మి విషయం తెలిసి సమస్యను తాను పరిష్కరిస్తానని, రూ. 13 లక్షలు ఇస్తే పట్టా మారుస్తానని వెంకటయ్యకు చెప్పింది. సరేనన్న వెంకటయ్య విడతలవారీగా రూ. 10 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారి సలహా మేరకు నిన్న సాయంత్రం కలెక్టరేట్లో జయలక్ష్మికి లక్ష రూపాయలు ఇచ్చాడు. ఆమె డబ్బును లెక్కపెడుతుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అంతేకాదు, ఆమె ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.