ట్రంప్ వెళ్లిపోయే వరకు మేం ప్రశాంతంగానే ఉంటాం... ఆ తర్వాత మేమేంటో చూపిస్తాం: ఢిల్లీ బీజేపీ నేత కపిల్ మిశ్రా
- ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక ధర్నాలు, నిరసనలు
- నిరసనకారులను పంపించేసి రోడ్లను క్లియర్ చేయాలన్న బీజేపీ నేత
- పోలీసుల వల్ల కాకపోతే మూకుమ్మడిగా రోడ్లపై పడతామని వెల్లడి
రోడ్లపై సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోకపోతే, ఇంకెవరు చెప్పినా వినిపించుకోమని, మూకుమ్మడిగా రోడ్లపై పడతామని పేర్కొన్నారు. 'నిరసనకారులు రోడ్లను దిగ్బంధించడం ద్వారా 35 లక్షల మందిని నిరోధించాలనుకుంటున్నారు. నిరసన తెలిపే విధానం ఇదేనా?' అంటూ కపిల్ మిశ్రా మండిపడ్డారు. గతంలో ఆమ్ ఆద్మీ సర్కారులో మంత్రి పదవి కూడా చేపట్టిన కపిల్ మిశ్రా ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.