Nara Lokesh: ప్రైవేటు సంస్థలు పోయాయి.. ఇప్పుడు ప్రభుత్వ సంస్థల వంతు వచ్చింది: నారా లోకేశ్

  • తుగ్లక్ నిర్ణయంతో నిన్నటి దాకా ప్రైవేటు పెట్టుబడులు పోయాయి
  • ఆంధ్రుడు ఏం పాపం చేశాడు?
  • తరలిపోతున్న ఓఎన్జీసీ కథనాన్ని షేర్ చేసిన లోకేశ్
Nara Lokesh fires on Jagan

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మన తుగ్లక్ నిర్ణయంతో నిన్నటి దాకా ప్రైవేటు పెట్టుబడులు పోయాయని... ఇప్పుడు ప్రభుత్వ సంస్థల వంతు వచ్చిందని అన్నారు. ఈ అపఖ్యాతిని మూటగట్టుకోవడానికి ఆంధ్రుడు ఏం పాపం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీంతోపాటు ఓ వార్తా పత్రికలో వచ్చిన 'తరలిపోతున్న ఓఎన్జీసీ... ఆపరేషన్ల నిలిపివేత' కథనాన్ని షేర్ చేశారు.

More Telugu News