Amit Shah: ‘గోలీ మారో’ వంటి కామెంట్లను మేము చేసి ఉండాల్సింది కాదు.. ఢిల్లీ ఓటమిపై అమిత్ షా
కొందరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లలో పార్టీ గెలుపుపై ప్రభావం పడిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ నేతలు ‘గోలీ మారో’, ‘ఈ ఎలక్షన్ ఇండియా- పాకిస్థాన్’ మ్యాచ్ వంటి కామెంట్లు చేసి ఉండాల్సింది కాదని చెప్పారు. అలాంటి వ్యాఖ్యలకు తాను ఎప్పుడూ దూరంగా ఉంటానని పేర్కొన్నారు. ఢిల్లీ ఎలక్షన్లలో ఆప్ ఘన విజయం, బీజేపీ ఓటమి తర్వాత ఆయన తొలిసారిగా గురువారం ఈ విషయంపై మాట్లాడారు.