RamyaKrishna: 'కేజీఎఫ్ 2' కోసం రమ్యకృష్ణ భారీ పారితోషికం అడిగిందట!

  • షూటింగు దశలో 'కేజీఎఫ్ 2'
  • ప్రతినాయక పాత్రలో సంజయ్ దత్ 
  •  యశ్ సరసన నాయికగా శ్రీనిధి శెట్టి
Kgf 2 Movie

తెలుగు .. తమిళ భాషల్లో రమ్యకృష్ణకి ఇప్పుడు విపరీతమైన క్రేజ్ వుంది. 'బాహుబలి'లో శివగామి పాత్ర నుంచి, కీలకమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. పవర్ఫుల్ పాత్ర ఏదైనా వుంటే ముందుగా దర్శకనిర్మాతలు ఆమెనే సంప్రదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'కేజీఎఫ్ 2' సినిమాలో లేడీ పీఎమ్ పాత్రకి గాను రమ్యకృష్ణను అడిగారట.

అయితే ఆ సినిమాకి గల భారీతనాన్ని .. ఆ పాత్ర ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రమ్యకృష్ణ పెద్ద మొత్తంలోనే పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. దాంతో వాళ్లు రవీనా టాండన్ ను తీసుకున్నారట. యష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా సంజయ్ దత్ కనిపించనున్నాడు. ఒక ముఖ్యమైన పాత్రను రావు రమేశ్ పోషిస్తున్నాడు. మొదటి భాగం సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే రెండవ భాగంపై భారీ అంచనాలు వున్నాయి.

More Telugu News