సౌందర్య చనిపోయిందని తెలిసినప్పుడు తట్టుకోలేకపోయాను: పరుచూరి గోపాలకృష్ణ
సౌందర్య మొదటి సినిమా నుంచి మాకు తెలుసు. ఆమెలో తొలి రోజుల్లో చూసిన వినయ విధేయతలనే చివరివరకూ చూశాము. 2004లో ఏప్రిల్ 17వ తేదీన నేను డాక్టరేట్ అందుకోబోతుండగా, హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోయిందని తెలిసింది. ఆ వార్త విని నేను తట్టుకోలేకపోయాను. నా కళ్ల ముందు ఎదుగుతూ వచ్చిన అమ్మాయి, హఠాత్తుగా అలా అదృశ్యం కావడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను" అని చెప్పుకొచ్చారు.