Chevireddy Bhaskar Reddy: ఏబీ వెంకటేశ్వరరావుకు బెంగళూరులో వెయ్యి కోట్ల ప్రాపర్టీ ఉంది: చెవిరెడ్డి ఆరోపణలు

  • బెంగళూరులో ఆయనకు వంద ఎకరాలు ఉన్నాయి
  • ఎకరం ధర కనీసం రూ.10 కోట్లు
  • విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు  

ఏపీలో సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరావుకు బెంగళూరులో వెయ్యి కోట్ల ప్రాపర్టీ ఉందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బెంగళూరులో వ్యవసాయం చేస్తానని చెబుతున్న వెంకటేశ్వరరావుకు అక్కడ వంద ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు. ఎకరం ధర కనీసం రూ.10 కోట్లు అనుకుంటే ఆ భూముల మొత్తం విలువ వెయ్యికోట్ల రూపాయల వరకు ఉంటుందని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు హయాంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడి ఆస్తులు సంపాదించారని, వాటిని చూసుకునే తీరిక కూడా ఆయనకు లేదని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి తనను సస్పెండ్ చేయడాన్ని అదృష్టంగా భావిస్తారే తప్ప పనిష్ మెంట్ గా భావించరని ఏబీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

More Telugu News