Punjab: పంజాబ్ లో విషాదం... బాణసంచా ఉంచిన ట్రాక్టర్ కు నిప్పంటుకుని 15 మంది మృతి

  • పంజాబ్ తరన్ తరన్ జిల్లాలో ఘోర ప్రమాదం
  • నగర్ కీర్తన్ కార్యక్రమంలో పేలుడు
  • మృతులందరూ యువకులే!

పంజాబ్ లో ఘోరప్రమాదం జరిగింది. తరన్ తరన్ జిల్లాలో ఓ ఊరేగింపు జరుగుతుండగా బాణసంచా ఉంచిన ట్రాక్టర్ కు నిప్పంటుకుని 15 మంది మరణించారు. నగర్ కీర్తన్ ఊరేగింపు నిర్వహిస్తుండగా, ట్రాక్టర్ పై పొరబాటున నిప్పురవ్వలు పడ్డాయి. దాంతో ఆ ట్రాక్టర్ లో ఉన్న బాణసంచా విస్ఫోటనం చెందింది. ఈ పేలుడు ధాటికి ట్రాక్టర్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో మరణించిన వాళ్లంతా యువకులే. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. పేలుడు తీవ్రత కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

More Telugu News