Sharwanand: 'జాను' చేయడానికి ఆలోచించాను .. కారణాలివే: హీరో శర్వానంద్

  • '96' సినిమాను చూశాను 
  •  ట్రోల్ చేస్తారేమో అనుకున్నాను 
  • 'దిల్' రాజుగారిని నమ్మి చేశానన్న శర్వా

శర్వానంద్ - సమంత జంటగా రూపొందిన 'జాను' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'దిల్' రాజు నిర్మించిన ఈ సినిమాకి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాను గురించి శర్వానంద్ మాట్లాడుతూ .. 'దిల్' రాజుగారు ఈ సినిమా చేద్దామని అన్నప్పుడు, తమిళ మూవీ '96' చూశాను. క్లాసిక్ మూవీ కదా .. చేయగలనా? అనుకున్నాను. పైగా విజయ్ సేతుపతితో పోల్చి చూసి ట్రోల్ చేస్తారేమోననే సందేహం కూడా కలిగింది.

ఇక సమంతతో కలిసి నటించడం సామాన్యమైన విషయం కాదు. ఆమె స్థాయికి తగినట్టుగా చేయగలనా? అని కూడా ఆలోచించాను. ఈ విషయాలను గురించే నేను 'దిల్' రాజుగారితో మాట్లాడాను. అయితే 'నన్ను నమ్ము' అని ఆయన అన్నారు. అంతే .. అప్పటి నుంచి దర్శకుడు ప్రేమ్ కుమార్ ఏది చెబితే అది చేస్తూ వెళ్లాను. చాలా బాగా చేశానని ఇప్పుడు అంతా అంటూ ఉంటే చాలా హ్యాపీగా వుంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News