Hyderabad: హైదరాబాదు శివార్లలో విషాదం... ఒకే గదిలో ఇద్దరమ్మాయిలు ఆత్మహత్య

  • రాఘవేంద్ర నగర్ లో ఘటన
  • వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా మమత అనే అమ్మాయి ఆత్మహత్య
  • స్నేహితురాలు గౌతమి సైతం బలవన్మరణం
  • సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

హైదరాబాదు శివార్లలో ఒకే గదిలో గౌతమి, మమత అనే ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్రనగర్ లో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యకు పాల్పడిన అమ్మాయిలిద్దరూ స్నేహితులు. డిగ్రీ చదువుతున్నారు. కాగా, 10 రోజుల్లో మమత పెళ్లి జరగాల్సి ఉంది. అయితే మమత తల్లిదండ్రులు ఓ శుభకార్యానికి వెళ్లగా, సోదరుడు స్కూల్ కు వెళ్లాడు. సోదరుడు తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి పైకప్పుకు ఉన్న ఇనుపరాడ్ కు ఉరివేసుకుని మమత, గౌతమి విగతజీవుల్లా కనిపించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమికంగా వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఆ ఇద్దరమ్మాయిలు రాసిన సూసైడ్ నోట్ లో ఆసక్తికర వివరాలు ఉన్నాయి. తాము తమ తల్లిదండ్రులకు భారం అయ్యామని, పెళ్లికి భారీగా లాంఛనాలు సమర్పించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి మరే యువతికి రాకూడదని తెలిపారు.

More Telugu News