Nagashourya: హీరో నాగశౌర్యపై హెచ్చార్సీలో ఫిర్యాదు చేసిన తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్స్ జేఏసీ

  • మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడాడని ఆరోపణ
  • చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీని కోరిన జేఏసీ
  • తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్

'అశ్వత్థామ' చిత్రం విజయంతో హీరో నాగశౌర్య ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నాడు. అయితే నాగశౌర్యపై తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్స్ జేఏసీ మానవ హక్కుల సంఘం (హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేసింది. నాగశౌర్య తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగశౌర్య తక్షణమే క్షమాపణలు చెప్పాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.

More Telugu News