Pattabhi: ‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్’ లో జగన్ కు రూ.9 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి: టీడీపీ నేత పట్టాభి

  • ఈ విషయమై జగన్ సమాధానం చెప్పాలి
  • ‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్’ పై వైసీపీ ఎంపీలవి అసత్యాలు  
  • ఆ కంపెనీ ప్రతినిధులను మంత్రి మేకపాటి బెదిరించారు

సీఎం జగన్ కు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీలో రూ.9 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని, ఈ విషయాన్ని జగనే స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. ఈ విషయమై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీపై వైసీపీ ఎంపీలు అసత్యాలు చెబుతున్నారని, ఆ కంపెనీని తరిమేసి ఆ భూములను దోచుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ‘J-ట్యాక్స్’కు కంపెనీలన్నీ భయపడిపోతున్నాయని, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ ప్రతినిధులను తన ఆఫీసుకు పిలిపించుకుని వారిని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బెదిరించారని ఆరోపించారు.

More Telugu News