Nara Lokesh: నారా లోకేశ్ భద్రతను మరింత తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం

  • లోకేశ్ కు ఇప్పటివరకు 2+2 సెక్యూరిటీ
  • దాన్ని 1+1కి తగ్గించిన ప్రభుత్వం
  • టీడీపీ హయాంలో లోకేశ్ కు జెడ్ కేటగిరీ భద్రత

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ కు ఇప్పటివరకు వై ప్లస్ భద్రత ఉండగా, దాన్ని కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వై ప్లస్ కేటగిరీ కింద లోకేశ్ కు 2 ప్లస్ 2 భద్రత ఉండేది. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ఆ భద్రత 1 ప్లస్ 1కు తగ్గిపోనుంది. టీడీపీ హయాంలో లోకేశ్ భద్రత 4 ప్లస్ 4గా ఉండేది. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో ఓ ఎమ్మెల్యేను మావోలు చంపేయడంతో లోకేశ్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. దాంతో అదనపు భద్రత ఏర్పాట్లు కల్పించేవారు. ఆ తర్వాత వైసీపీ సర్కారు రావడంతో లోకేశ్ భద్రతను 2 ప్లస్ 2కి కుదించారు. ఇప్పుడది కూడా తగ్గించారు.

More Telugu News