Shakeela: తన సినిమా టీజర్ లో ‘మూడు రాజధానులు’ గురించి ప్రస్తావించిన షకీలా !

  • షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం
  • ‘ఆంధ్రాకు మూడు రాజధానులా?’ అంటూ షకీలా ప్రశ్న
  • ఒక్క రాష్ట్రానికే ముగ్గురు సీఎంలు ఉంటారేమోనంటూ షకీలా ఆశ్చర్యం

ఏపీకి మూడు రాజధానుల అంశం ఎంత హాట్ టాపిక్ గా మారిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అంశంపై ఇప్పటికే ప్రతిపక్షాల సెటైర్లు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులూ తమ అభిప్రాయాలు వెల్లడించారు. తాజాగా, ప్రముఖ శృంగార తార షకీలా తొలిసారిగా రాసిన కుటుంబ కథా చిత్రం టీజర్ లో ఏపీకి మూడు రాజధానుల అంశం గురించిన ప్రస్తావన ఉంది.

 కుర్చీలో కూర్చుని ఉన్న షకీలా ఓ పత్రికలో పతాక శీర్షిక ‘ఆంధ్రాకు మూడు రాజధానులు’ను చూడటం ఆ టీజర్ లో కనబడుతుంది. ‘ఆంధ్రాకు మూడు రాజధానులా?’ అంటూ తన పక్కనే నిలబడి ఉన్న ఓ వ్యక్తిని షకీలా ప్రశ్నించగా...‘అవును మేడమ్.. జగనన్న మూడు రాజధానులు చేశారుగా’ అని సమాధానం చెబుతాడు. ‘ఒక్క స్టేట్ కే మూడు రాజధానులా? పోను పోను.. ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అంటూ షకీలా పరిహాసం ఆడుతుంది. 


More Telugu News