Banks: రేపు, ఎల్లుండి బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె!

  • వేతన సవరణ కోరుతున్న ఉద్యోగులు
  • 13 శాతం పెంచేందుకు మాత్రమే అనుమతి
  • డిమాండ్లు పరిష్కరించాలంటున్న యూనియన్లు

వేతన సవరణను డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా జాతీయ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో సమ్మె బాట పట్టనున్నారు. బ్యాంకు ఉద్యోగుల వేతనాలు పెంచాలని 20 సార్లు చర్చలు జరిపామని, ఉన్నతాధికారులు 13 శాతానికి మించి పెంచేందుకు అంగీకరించ లేదని యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంక్ యూనియన్స్ నేతలు వెల్లడించారు. ఉద్యోగులపై పనిభారం పెరిగిపోయిందని, ఖాతాదారుల కోసం శ్రమించి, సేవలందిస్తున్నా, తమను పట్టించుకోకుండా, డిమాండ్ల పరిష్కారం విషయంలో సాగతీత ధోరణిలోనే ప్రభుత్వం ఉందని యూనియన్ నాయకులు ఆరోపించారు. రెండు రోజుల సమ్మెతో ప్రభుత్వం దిగిరాకుంటే, మార్చి 11 నుంచి మూడు రోజుల సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు.

More Telugu News