India: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

  • న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా
  • ఇప్పటికే 2-0 ఆధిక్యంలో భారత్
  • జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మూడో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుతో తలపడుతోంది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ మైదానంలో ఇటీవల జరిగిన రెండు మ్యాచుల్లోనూ టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరుగుతోన్న నేటి మ్యాచ్‌ కూడా గెలిస్తే కప్ సొంతమవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.

మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియాలో ఎటువంటి మార్పులు లేవు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, దుబే, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఛాహల్, షమీ, బుమ్రా ఉన్నారు. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. కనీసం మూడో మ్యాచ్‌లోనైనా గెలవాలన్న కసితో న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌ ఆడుతోంది.

More Telugu News