Naga Shaurya: పవన్ వాయిస్ ఓవర్ తో 'అశ్వద్ధామ' ఆరంభం

  • నాగశౌర్య ఇమేజ్ కి భిన్నంగా 'అశ్వద్ధామ'
  • టీజర్ కి .. ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ 
  •  ఈ నెల 31వ తేదీన విడుదల

నాగశౌర్య కథానాయకుడిగా 'అశ్వద్ధామ' రూపొందింది. నాగశౌర్య సొంత బ్యానర్లో మెహ్రీన్ కథానాయికగా ఈ సినిమా నిర్మితమైంది. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుందనేది తాజా సమాచారం.

పవన్ వాయిస్ ఓవర్ తో ఈ కథ మొదలుకానుండటం, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ వున్న నాగశౌర్య తొలిసారిగా పూర్తిస్థాయి యాక్షన్ మూవీ చేయడం విశేషం. యాక్షన్ కి ఎమోషన్ ను జోడిస్తూ ఆయన రాసిన ఈ కథ పట్ల ఆయన పూర్తి నమ్మకంతో వున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన ఈ సినిమా తప్పకుండా భారీ హిట్ కొడుతుందని భావిస్తున్నారు.

More Telugu News