Yash: 'కేజీఎఫ్ 2' క్లైమాక్స్ సీన్స్ హైదరాబాద్ లోనే!

  • సంచలన విజయాన్ని నమోదు చేసిన 'కేజీఎఫ్'
  • మైసూర్లో ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ 
  •  తదుపరి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా గతంలో రూపొందిన 'కేజీఎఫ్' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఒక్క కన్నడలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోను ఈ సినిమా వసూళ్లపరంగా కొత్త రికార్డులను సృష్టించింది. దాంతో ఈ సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు - హీరో ఇద్దరూ కలిసి రంగంలోకి దిగారు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ను మరింత భారీగా రూపొందిస్తున్నారు.

ఇందులో ప్రతినాయకుడిగా సంజయ్ దత్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్లో జరుగుతోంది. అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చివరి షెడ్యూల్ ను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. క్లైమాక్స్ కి సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తారట. ఇక్కడ చిత్రీకరించే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

More Telugu News