Nara Lokesh: జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వైసీపీ ఎమ్మెల్యేలు 20 మందా? 30 మందా?: నారా లోకేశ్

  • జగన్ నిర్ణయాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు
  • సంతలో గొర్రెల్లా కొన్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా హ్యాండ్ ఇచ్చారట
  • సొంత పార్టీలోనే జగన్ కు వ్యతిరేకత ఉంది 

ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన సంగతి తెలిసిందే. మరోవైపు మండలిని రద్దు చేయాలనే సీఎం జగన్ నిర్ణయాన్ని కొందరు ఎమ్మెల్యేలు వ్యతిరేకించారని టీడీపీ నేత నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. తాజాగా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... మండలిని రద్దు చేయాలనే జగన్ నిర్ణయాన్ని ఎంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారని ప్రశ్నించారు. 20 మంది ఎమ్మెల్యేలా? లేక 30 మంది ఎమ్మెల్యేలా? అని అడిగారు.

చివరకు సంతలో గొర్రెల్లా కొన్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా హ్యాండ్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోందని అన్నారు. జగన్ పాలన, నిర్ణయాల పట్ల సొంత పార్టీలోనే ఇంత వ్యతిరేకత ఉందనే విషయం శాసనసభ వేదికగా బయటపడిందని చెప్పారు. లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

More Telugu News