Mahesh Babu: తెలుగు రాష్ట్రాల్లో 'సరిలేరు నీకెవ్వరు' 16 రోజుల వసూళ్లు

  • మహేశ్ కి మళ్లీ దక్కిన సూపర్ హిట్
  • తెలుగు రాష్ట్రాల్లో 113.04 కోట్ల షేర్
  • అనిల్ తో మరో మూవీ చేయనున్న మహేశ్ 

మహేశ్ బాబు .. అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు'.. సంక్రాంతి కానుకగా సందడి చేసింది. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ కలగలిసిన ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయ విహారం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డుస్థాయిలో వసూళ్లను రాబట్టింది. 16 రోజుల్లో ఈ సినిమా 113.04 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజాంలోనే ఈ సినిమా 38.20 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం.

మహేశ్ బాబు యాక్షన్ .. రష్మిక అల్లరి .. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ .. దేవిశ్రీ అందించిన స్వరాలు ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని తెచ్చిపెట్టాయని అంటున్నారు. ఈ సినిమాతో అనిల్ రావిపూడిపై మహేశ్ బాబు నమ్మకం మరింతగా పెరిగింది. అందువల్లనే ఈ ఇద్దరి కాంబినేషన్ ఈ ఏడాది చివరిలో మరోసారి సెట్స్ పైకి వెళ్లొచ్చుననే టాక్ వినిపిస్తోంది.

More Telugu News