Pawan Kalyan: దేశానికి సేవ చేయాలనే బీజేపీతో కలిశా: పవన్ కల్యాణ్

  • హైదరాబాదులో మహా హారతి  
  • భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం
  • హాజరైన పవన్ కల్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాదులో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతోనే బీజేపీతో కలిశానని తెలిపారు. దేశ సేవలో కర్పూరంలా కరిగిపోవాలనిపిస్తోందని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపైనా ప్రశంసలు కురిపించారు. మోదీది దృఢమైన నాయకత్వం అని, ప్రత్యర్థి దేశాలు భీతిల్లిపోయే శక్తి ఆయన సొంతమని కీర్తించారు. దేశాన్ని భద్రంగా ఉంచే నాయకత్వం బీజేపీలోనే ఉందని అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News