Revanth Reddy: పోలీసులపై నేరుగా ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

  • మహిళా కౌన్సిలర్ ను టీఆర్ఎస్ క్యాంపునకు తరలించారంటూ ఆరోపణ
  • పోలీసుల తీరుపై ఆగ్రహం
  • పోలీసులపై ఈసీకి ఫిర్యాదు

తెలంగాణ పోలీసుల తీరుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కోస్గి పట్టణంలో తమ శిబిరంలో ఉన్న 16వ వార్డు కౌన్సిలర్ ఎల్లమ్మను పోలీసులే బలవంతంగా టీఆర్ఎస్ క్యాంపునకు తరలించారని ఆరోపించారు. ఈ మేరకు నారాయణపేట జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరును ఖండిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు పోలీసుల వ్యవహార సరళిపై ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

More Telugu News