TRS: మొదలైన క్యాంప్ రాజకీయాలు.. రెండు బస్సుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరలింపు

  • ఆదిలాబాద్‌ నుంచి తరలించిన జోగు రామన్న
  • ఆదిలాబాద్‌ మున్సిపిల్ పరిధిలో మొత్తం 49 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు
  • మున్సిపల్ ఛైర్మన్‌ బరిలో ఎమ్మెల్యే జోగు రామన్న కుమారుడు  

రేపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో.. తమ అభ్యర్థులను శిబిరాల్లో ఉంచాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జోగు రామన్న స్వయంగా ఆదిలాబాద్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థులను రెండు బస్సుల్లో తరలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ మున్సిపల్ పరిధిలో మొత్తం 49 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీ చేశారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్‌ బరిలో ఎమ్మెల్యే జోగు రామన్న కుమారుడు జోగు ప్రేమేందర్ ఉన్నారు.

అభ్యర్థులను రెండు రోజుల పాటు క్యాంపుల్లో ఉంచాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించడంతో పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఈ చర్యలు తీసుకుంటున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్, 27న మేయర్, చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు.

More Telugu News