Jagan: ఫిబ్రవరి 1 నుంచి సీఎం జగన్ గ్రామాల పర్యటన

  • ఏపీలో ‘రచ్చబండ’ తరహా కార్యక్రమం
  • సంక్షేమ పథకాల అమలు ఎలా ఉందో తెలుసుకోనున్న సీఎం
  • ప్రజలను అడిగి తెలుసుకోనున్న జగన్

ఏపీలో ‘రచ్చబండ’ తరహా కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వం పని తీరు గురించి నేరుగా ప్రజలను అడిగి ఆయన తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో అధికారులతో జగన్ సమీక్షించారు. ముఖ్యంగా గ్రామాల్లో పర్యటించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. త్వరలో శ్రీకారం చుట్టనున్న ఈ కార్యక్రమానికి ‘రచ్చబండ’ అనే పేరును ఖరారు చేస్తారా? లేదా? అన్న విషయం తెలియాల్సి ఉంది.

More Telugu News