Amaravati: స్మార్ట్ సిటీ లక్ష్యాలను చేరుకోవడంలో అమరావతికి అవార్డు

  • రికగ్నేషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో ఏపీ రాజధానికి అవార్డు
  • విశాఖకు ఫ్లోటింగ్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుపై పురస్కారం
  • విశాఖలో స్మార్ట్ సిటీల మూడో శిఖరాగ్ర సమావేశం

ఏపీ రాజధాని అమరావతిపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఓ అవార్డు లభించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. స్మార్ట్ సిటీ మిషన్ లక్ష్యాలను చేరుకోవడంలో కనబర్చిన పురోగతి ఆధారంగా అమరావతిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. స్మార్ట్ నగరాల అంశంలో రికగ్నేషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో అమరావతికి ఈ పురస్కారం లభించింది. విశాఖలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఆకర్షణీయ నగరాల మూడో శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో భాగంగా పలు అంశాల్లో ఆదర్శంగా నిలిచిన నగరాలకు అవార్డులు అందిస్తున్నారు. కాగా, విశాఖపట్నం నగరానికి వినూత్న ఆవిష్కరణల అంశంలో ఫ్లోటింగ్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుపై అవార్డు అభించింది.

More Telugu News