Andhra Pradesh: ఓ చిన్న పిల్లవాడు కూడా 'సీఎం డౌన్ డౌన్' అనడం ప్రజల మనోభావాలను చాటుతోంది: చంద్రబాబు

  • రైతుల పరిస్థితికి చంద్రబాబు సానుభూతి
  • మూడు రాజధానులు ఓ విపరీత నిర్ణయం అని వెల్లడి
  • దారుణ పర్యవసానాలు తప్పవని హెచ్చరిక

రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు మాటల్లో వర్ణించలేనంత కష్టం, విషాదం వచ్చిపడ్డాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ చిన్నపిల్లవాడు సైతం సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తుండడం ప్రజల్లో నెలకొన్న వ్యతిరేక భావనకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులు అనేది ఓ విపరీత నిర్ణయం అని, ఆ నిర్ణయంతో ఏపీ దారుణ పర్యవసానాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

More Telugu News