Pawan Kalyan: పార్టీ కార్యాలయం గేటువద్దే.. పవన్ ను అడ్డుకున్న పోలీసులు

  • రాజధాని గ్రామాల పర్యటనకు బయలుదేరిన పవన్
  • అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
  • భారీగా మోహరించిన పోలీసులు

అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజధాని గ్రామాల పర్యటనకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బయలు దేరడానికి సమాయత్తమవుతున్న సమయంలో కార్యాలయం గేటువద్ద పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. పర్యటనకు వెళ్లవద్దని పోలీసు అధికారులు పవన్ ను కోరుతున్నారు. దీంతో ఓ వైపు కార్యకర్తలు, మరోవైపు పోలీసులతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

పార్టీ కార్యాలయానికి భారీ సంఖ్యలో పోలీసులు రావడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహిస్తూ, వారిని అడ్డుకున్నారు. కాగా పవన్ ఎర్రబాలెం, పెనుమాక, మందడం గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

More Telugu News