Raviteja: సెన్సార్ పూర్తి చేసుకున్న 'డిస్కోరాజా'

  • రవితేజ ద్విపాత్రాభినయం
  • ముగ్గురు కథానాయికలు 
  • ఈ నెల 24వ తేదీన విడుదల

ఒకే తరహా కథలు .. పాత్రలు వస్తుండటంతో, కొత్తదనం కోసం రవితేజ కొంత గ్యాప్ తీసుకున్నాడు. వైవిధ్యభరితమైన కథ అనిపించడంతోనే ఆయన 'డిస్కొరాజా' సినిమాను అంగీకరించాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, తాజాగా సెన్సారు కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U\A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు.

ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా, ఆయన సరసన నభా నటేశ్ .. పాయల్ .. తాన్యా హోప్ అలరించనున్నారు. ముఖ్యమైన పాత్రల్లో సునీల్ .. వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకి తమన్ అందించిన సంగీతం ప్రత్యేకంగా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమాపై రవితేజ పెట్టుకున్న ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.

More Telugu News