ఆర్మీని అవమానిస్తారా.. సిగ్గులేదూ?: కాంగ్రెస్పై రాంమాధవ్ మండిపాటు
- పార్లమెంట్, పుల్వామా దాడులపై పునర్విచారణా?
- పాకిస్థాన్కు క్లీన్ చిట్ ఇచ్చేంతగా దిగజారాలా
- కాంగ్రెస్ తీరును ఎండగడతాం
పౌరసత్వ సవరణ చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో కాంగ్రెస్ తీరును ఎండగడతామని రాంమాధవ్ అన్నారు. సీఏఏపై అపోహలను, అవాస్తవాలను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎటువంటి అంశాలు దొరక్క పోవడంతో ప్రతిపక్షాలు దుష్ప్రచారాన్ని ప్రారంభించాయన్నారు. వాటిని తిప్పికొట్టి మోదీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని రాంమాధవ్ పిలుపునిచ్చారు. సీఏఏపై ఇటీవల ట్వీట్ చేసిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కాంగ్రెస్ దుష్ప్రచారంలో ఇరుక్కున్నారని రాంమాధవ్ విమర్శించారు.