ktr: కొందరు టీఆర్ఎస్ పేరుతో మభ్యపెడుతున్నారు... ప్రజలు కారు గుర్తుకే వేయాలి!: కేటీఆర్

  • తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం 
  • సిరిసిల్ల మున్సిపాలిటీ మేనిఫెస్టో విడుదల చేసిన కేటీఆర్
  • ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ కే ఉందని ఉద్ఘాటన

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి కేటీఆర్ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సిరిసిల్ల టౌన్ మున్సిపాలిటీకి సంబంధించి ఆయన ఇవాళ మేనిఫెస్టో విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, పురపాలక ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఒక్క టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని ఉద్ఘాటించారు. అయితే కొందరు నేతలు టీఆర్ఎస్ పేరుతో మభ్యపెడుతున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటేస్తేనే టీఆర్ఎస్ కు ఓటు వేసినట్టవుతుందని స్పష్టం చేశారు. దేశంలోనే ది బెస్ట్ మున్సిపాలిటీగా సిరిసిల్లను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లకు రైలు మార్గం తెచ్చేందుకు కృషిచేస్తానని చెప్పారు.

ktr

More Telugu News