Andhra Pradesh: తుళ్లూరులో రైతు దంపతుల కాళ్లు కడిగిన కొండవీటి జ్యోతిర్మయి

  • రాజధాని కోసం రైతుల ఆందోళన
  • తుళ్లూరులో దీక్ష
  • సంఘీభావం ప్రకటించిన కొండవీటి జ్యోతిర్మయి

ఏపీ రాజధాని మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రాజధాని రైతుల పోరాటానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. తాజాగా, ప్రవచనకర్త, గాయకురాలు కొండవీటి జ్యోతిర్మయి కూడా రైతులకు సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజధాని విషయంలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్లాడుతున్న అమరావతి రైతులకు ఆ దేవుడి సాయం తప్పక అందుతుందని అన్నారు. కష్టకాలం నుంచి రైతులకు తప్పక ఉపశమనం లభిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రవచనాలు చెప్పి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసిన కొండవీటి జ్యోతిర్మయి ఓ రైతు దంపతుల కాళ్లు కడిగి, రైతుల త్యాగాలను స్మరించుకున్నారు.

More Telugu News