Ravulapalem: పండుగ పూట రక్తమోడిన రహదారి... రావులపాలెం వద్ద నలుగురు దుర్మరణం

  • రెండు కార్లు ఢీ
  • డివైడర్ దాటి అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లిన కారు
  • మృతులు సిద్ధాంతం గ్రామ వాసులుగా గుర్తింపు

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. విజయవాడ వైపు వెళుతున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను దాటి ఇవతలి రోడ్డుపై ప్రయాణిస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఓ మహిళ కూడా ఉన్నారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

More Telugu News