Tirumala: తిరుమలలో తగ్గిన రద్దీ... 3 గంటల్లోనే సర్వదర్శనం!

షార్ట్స్‌లో చూడండి
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు ముగిసిపోవడంతో, తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. నిన్న రాత్రి 12 గంటల సమయంలో వైకుంఠ ద్వారాలను మూసివేశారు. ఆపై ఈ తెల్లవారుజాము నుంచి సాధారణ దర్శనాలు మొదలుపెట్టారు.

ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో స్వామి సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి చూస్తున్నారు. వీరికి దర్శనానికి గరిష్ఠంగా 3 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్, ప్రత్యేక, దివ్య దర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు 2 గంటల్లోనే దర్శనం పూర్తవుతుందని తెలిపారు. నిన్న శ్రీవారిని 90,578 మంది భక్తులు దర్శించుకున్నారని, 16,149 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ ఆదాయం 3.19 కోట్లని టీటీడీ అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Tirumala
Tirupati
TTD

More Telugu News