India: ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన శార్దూల్... స్వల్ప స్కోరుతో సరిపెట్టుకున్న శ్రీలంక

  • భారత్ టార్గెట్ 143 రన్స్
  • రాణించిన సైనీ, కుల్దీప్
  • ఇండోర్ వేదికగా రెండో టి20

ఇండోర్ లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్ లో భారత పేసర్ శార్దూల్ ఠాకూర్ కేవలం 5 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. శార్దూల్ కు తోడు సైనీ, బుమ్రా, కుల్దీప్ కూడా రాణించడంతో శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో భారీ స్కోరు చేయనివ్వకుండా నిలువరించారు. సైనీ 2, కుల్దీప్ 2, బుమ్రా 1, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీసి లంక పతనంలో పాలుపంచుకున్నారు. ఈ ఇన్నింగ్స్ లో శార్దూల్ ఠాకూర్ విసిరిన 19వ ఓవర్ హైలైట్ అని చెప్పాలి. అప్పటివరకు తన ఖాతాలో వికెట్ లేకుండా ఉన్నా ఈ ముంబయి బౌలర్ ఆ ఓవర్ పూర్తయ్యేసరికి మూడు వికెట్లను సాధించాడు. లంక ఇన్నింగ్స్ లో కుశాల్ పెరీరా 34 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

More Telugu News