JNU: మాపై దాడికి పాల్పడింది ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ గూండాలే: జేఎన్యూ విద్యార్థి నేత ఐషే ఘోష్ ఆరోపణ

  • పక్కా ప్రణాళికతోనే ఈ దాడికి పాల్పడ్డారు
  • కొంతమంది ప్రొఫెసర్లు, ఏబీవీపీ నాయకులు హింసను ప్రేరేపించారు
  • దాడిని ఖండిస్తున్నా.. వైస్ ఛాన్స్ లర్ ను వెంటనే తొలగించాలి

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్ యూ) విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్ సహా పలువురు విద్యార్థులపై నిన్న దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై  స్పందించిన ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, వర్శిటీలో దాడికి పాల్పడింది ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ గూండాలేనంటూ సంచలన ఆరోపణలు చేశారు.

పక్కా ప్రణాళికతోనే ఈ దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు నుంచే ఆర్ఎస్ఎస్ అనుబంధ ప్రొఫెసర్లు, ఏబీవీపీ నాయకులు కొంతమంది క్యాంపస్ లో హింసను ప్రేరేపిస్తూ వచ్చారని ఆరోపించారు. ఈ దాడిని ఖండిస్తున్నట్టు చెప్పిన ఘోష్, వైస్ ఛాన్స్ లర్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. 

More Telugu News