Amravathi: రాజధానిగా విశాఖ అన్నివిధాలా అనువైన నగరం: విష్ణుకుమార్ రాజు

  • విశాఖపట్టణంలో రాజధాని ఏర్పాటుకు మద్దతిస్తున్నాం
  • రాజధానిగా అమరావతి పనికిరాదని కమిటీ చెప్పింది
  • అయినా, నాడు చంద్రబాబు పట్టించుకోలేదు

విశాఖపట్టణంలో రాజధాని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ యోచనపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. రాజధానిగా విశాఖ అన్నివిధాలా అనువైన నగరం అని, అందుకు తన మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు. రాజధానిగా అమరావతి పనికిరాదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని, అక్కడ రాజధాని ఏర్పాటు చేయొద్దని చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. రాజధాని వ్యవహారాన్ని చంద్రబాబు కావాలని చెప్పే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.

More Telugu News