Jammu And Kashmir: కశ్మీర్ లో పోలీసులకు పట్టుబడిన లష్కర్ ఉగ్రవాది

  • ఏడాది కిందట లష్కరే తోయిబాలో చేరిన కశ్మీర్ యువకుడు
  • ఆర్మీతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించిన కశ్మీర్ పోలీసులు
  • భారీగా ఆయుధాలు స్వాధీనం

ఏడాది కాలంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న లష్కరే తోయిబా ఉగ్రవాదిని జమ్మూకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బందిపొరా జిల్లాకు చెందిన నిస్సార్ దార్ మొదట ఉగ్రవాద సానుభూతిపరుడిగా ముద్రపడ్డాడు. ఆ తర్వాత ఏకంగా లష్కరే తోయిబా గ్రూపులో చేరాడు.

కొంతకాలంగా భద్రతాబలగాలపై దాడి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు గుర్తించారు. వాస్తవానికి నిస్సార్ గతేడాది జరిగిన ఎన్ కౌంటర్ లో కొద్దిలో ప్రాణాలతో తప్పించుకున్నాడు. ఇప్పటివరకు అతడిపై 8 ఎఫ్ఐఆర్ లు నమోదైనట్టు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈసారి ఆర్మీతో సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ తో నిస్సార్ పోలీసుల చేతచిక్కాడు. అతడి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News