YSRCP: వైసీపీ నేతలు విశాఖలో యాభై వేల ఎకరాలు కొనుగోలు చేశారు: టీడీపీ నేత జవహర్

  • అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే భూములు కొనుగోలు చేశారు
  • విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరపాలి
  •  రాజధాని అమరావతిని నిర్లక్ష్యం చేయొద్దు

ఏపీకి మూడు రాజధానుల అంశంపై టీడీపీ నేత జవహర్ విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధాని అమరావతిని నిర్లక్ష్యం చేయడమంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను పట్టించుకోకపోవడమేనని అన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్టణంలో భూముల అంశం గురించి ఆయన మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే విశాఖలో 50 వేల ఎకరాలను ఆ పార్టీ నేతలు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇక్కడ జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

More Telugu News