Somalia: సోమాలియాలో భారీ పేలుడు... 30 మంది పౌరుల మృతి

  • రాజధాని మొగదిషులో పేలిన కారు బాంబు
  • భద్రతా తనిఖీ కేంద్రం వద్ద ఘటన
  • పన్ను వసూలు కేంద్రం లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి

నిత్యం కల్లోలభరితంగా ఉండే ఆఫ్రికా దేశం సోమాలియాలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. సోమాలియా రాజధాని మొగదిషులో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 30 మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు. మరో 60 మంది వరకు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో అనేకమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మొగదిషులో ఎంతో రద్దీగా ఉండే సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద ఈ పేలుడు జరిగింది. ఇక్కడి పన్ను వసూలు కేంద్రం లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు భావిస్తున్నారు.

More Telugu News