Ramnath Kovind: ముగిసిన శీతాకాల విడిది... ఢిల్లీ పయనమైన రాష్ట్రపతి

  • హైదరాబాదులో రాష్ట్రపతి శీతాకాల విడిది
  • నిన్న తన నివాసంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహణ
  • రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన గవర్నర్, సీఎం

ప్రతి సంవత్సరం శీతాకాలంలో భారత రాష్ట్రపతి హైదరాబాదులో కొన్ని రోజుల పాటు విడిది చేయడం తెలిసిందే. ఈ ఏడాది కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాదు శివారు ప్రాంతం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కొన్నిరోజుల పాటు గడిపారు. నిన్న సాయంత్రం తన నివాసంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించిన రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిదిని ముగించుకున్నారు. ఈ ఉదయం ఆయన ఢిల్లీ పయనమయ్యారు. హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ వీడ్కోలు పలికారు.

More Telugu News