Keerthi Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • అవార్డును అంకితం ఇచ్చిన కీర్తి సురేశ్ 
  • చిరంజీవి, కొరటాల సినిమా అప్ డేట్ 
  • హైదరాబాదులో 'దర్బార్' ప్రీ రిలీజ్ వేడుక  

 *  'మహానటి' చిత్రంలోని అభినయానికి గాను ఇటీవల తాను అందుకున్న జాతీయ ఉత్తమ నటి అవార్డును సావిత్రికి అంకితం చేస్తున్నట్టు కథానాయిక కీర్తి సురేశ్ ప్రకటించింది. 'సావిత్రి అమ్మ ఆశీస్సుల వల్లే ఇదంతా జరిగింది. అందుకే ఆ అమ్మకే ఈ అవార్డును అంకితం చేస్తున్నాను' అని చెప్పింది కీర్తి.  
*  చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందే భారీ చిత్రం షూటింగ్ వచ్చే నెల 3 నుంచి జరుగుతుంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేసే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తోంది.
*  రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన 'దర్బార్' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో జనవరి 9న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 3న హైదరాబాదు శిల్ప కళా వేదికలో నిర్వహిస్తారు. దీనికి రజనీకాంత్ కూడా హాజరవుతారు.

More Telugu News